DonaldTrump : ఇరాన్తో వ్యాపారం: అమెరికా ఆంక్షలు, 6 భారత కంపెనీలపై ప్రభావం:ఇరాన్తో చమురు వ్యాపారం చేయొద్దని తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్తో వాణిజ్యం: ఆంక్షల గుప్పిట్లో ఆరు భారత కంపెనీలు
ఇరాన్తో చమురు వ్యాపారం చేయొద్దని తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది.
ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఆరు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మన దేశంపై 25 శాతం సుంకాలు (టారిఫ్లు) విధించిన ట్రంప్, ఇప్పుడు చమురు కంపెనీలపై ఆంక్షలతో మరో షాక్ ఇచ్చారు. ఈ ఆంక్షల వల్ల ప్రభావితమైన కంపెనీలు, వ్యక్తులకు అమెరికాలో ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని స్తంభింపజేస్తారు (ఫ్రీజ్ చేస్తారు).
మధ్యప్రాచ్యంలో అస్థిరతకు కారణమవుతున్న ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడమే తమ లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్కు చమురు విక్రయాల ద్వారా లభించే నిధులను అరికట్టాలని నిర్ణయించి, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
“అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయని 20 కంపెనీలపై మేము ఆంక్షలు విధిస్తున్నాం. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు అమెరికాతో వాణిజ్యం చేయడానికి అర్హత కోల్పోతారు” అని అమెరికా ప్రకటించింది.
ఆంక్షలు ఎదుర్కోనున్న భారత కంపెనీలు:
1.కాంచన్ పాలిమర్స్
2.ఆల్కెమికల్ సొల్యూషన్స్
3.రమణిక్లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ
4.జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్
5.గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్
6.పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్
Read also:DonaldTrump : ఇరాన్తో వ్యాపారం: అమెరికా ఆంక్షలు, 6 భారత కంపెనీలపై ప్రభావం
